కాచిగూడలో భారీగా డ్రగ్స్ సీజ్

కాచిగూడలో భారీగా డ్రగ్స్ సీజ్
  • అమెరికా నుంచి అక్రమ మార్గంలో హైదరాబాద్​కు..
  • ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: కాచిగూడ రైల్వే స్టేష్టన్‌‌‌‌ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌‌‌‌లో బుధవారం ఈ కేసు వివరాలను ఎక్సైజ్‌‌‌‌ ఎన్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఖురేషి వెల్లడించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌‌‌‌, స్కోడా కారు నుంచి సరుకు మార్పిడి చేసుకుంటున్నారు. వారిపై అనుమానం రావడంతో ఎస్టీఎఫ్ బీటీమ్‌‌‌‌, ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

కారులో 500 గ్రాముల ఓజీ కుష్‌‌‌‌, ఒక కేజీ గంజాయి, 6 గ్రాముల చరస్‌‌‌‌, 4.38 గ్రాముల హషీష్‌‌‌‌ సింథాటిక్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌తో పాటు ఐదు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రతిష్ బట్, జైసూర్యను అరెస్టు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా పండించే ఓజీ కుష్​ను​అక్రమ మార్గంలో ఇండియాకు దిగుమతి చేసి,  బెంగూళూరు నుంచి హైదరాబాద్‌‌‌‌కు తరలిస్తున్నారన్నారు. 

గంజాయి సప్లయర్​గా  జెప్టో డెలివరీ బాయ్

గచ్చిబౌలి : గచ్చిబౌలి ఐటీ కారిడార్​లో గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన రంజిత్ (21) సిటీలో జెప్టో డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు. షామీర్ పేట్ మండలం కేశవరంలోని ఓ వ్యక్తి వద్ద రంజిత్ బుధవారం గంజాయి కొనుగోలు చేసి, గచ్చిబౌలికి వచ్చాడు. విశ్వసనీయ సమాచారంతో అతడిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 250 గ్రాముల గంజాయి సీజ్ చేశారు.